Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈడియట్, నువ్వు అసలు జర్నలిస్ట్ వే కాదు.. : మండిపడ్డ దర్శకుడు వియన్ ఆదిత్య
హైదరాబాద్: తొలి చిత్రం 'మనసంతా నువ్వే' తో పరిచయం అయి, సంచలనమైన హిట్ ఇచ్చిన దర్శకుడు వియన్ ఆదిత్య. ఆ తర్వాత చేసిన చిత్రాలలో కొన్ని ఆడలేదు. ఇప్పుడు ఆయన తిరిగి రీ ఎంట్రీ ఇవ్వటం కోసం కథ రాసుకుంటూ యుఎస్ లో ఉన్నారు.
అయితే తాజాగా ఈ దర్శకుడుపై ఓ న్యూస్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చచింది. ఆయన తన కుటుంబాన్ని వదిలేసి అమెరికా వెళ్లిపోయారంటూ వార్త వచ్చింది. దాంతో ఆయన ఈ జర్నలిస్ట్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
'
నా
సోదరుడు
సతీష్
స్నేహితుడుగా
నీకు
గౌరవం
ఇస్తాను.
అలాగే
నీకు
ఇష్టం
వచ్చినట్లుగా
రాసేందుకు
హక్కుందని
నాకు
తెలుసు.
నీకు
అవసరమైనప్పుడల్లా
నా
నుంచి
సాయం
పొందావ్.
ఇప్పుడు
నువ్వేంటో,
నీ
అసలు
రంగు
ఏంటో
చూపించావ్.
ఈడియట్..
వేరే
వారి
జీవితంపై
బురద
జల్లడం
మానేయ్.
ఇవాల్టి
నుంచి
నువ్వసలు
జర్నలిస్టువే
కాదు'
అన్నారు.
'స్కైప్ కాల్ మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకుని.. పబ్లిక్ లో ఫైట్ చెయ్. మా కుటుంబం అంతా సీనియర్ జర్నలిస్టులే. నా కుటుంబం గురించి నీకేం తెలుసు. నాలో వేరే యాంగిల్ ని కదపద్దు. నాకెపుడూ సాయం చేయని వాళ్లకి నేనేంటో ప్రూవ్ చేయాల్సిన పని లేదు. పెన్ను సరిగ్గా వాడు. నీ దిక్కు మాలిన రాతలకు తగిన ఫలితం అనుభవించేందుకు సిద్ధంగా ఉండు' అంటూ విరుచుకుపడ్డారు వీఎన్ ఆదిత్య..
అలాగే 'కవర్ లో డబ్బులు తీసుకుని సినిమాని ప్రమోట్ చేసే నీకేం తెలుస్తుంది క్రియేటర్ విలువ.. వాడి జీవితం గురించి' అన్నారు.
అలాగే కెరీర్ ప్రారంభ దశలో మనసంతా నువ్వే వంటి హిట్టు సాధించిన ఆయన ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఈ విషయంపై ఆయన గతంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఓ పద్దతి ప్రకారం జరగాలనుకునే వ్యక్తిని నేను.
మనసంతా నువ్వే తర్వాత దాదాపు ఇరవై మంది నిర్మాతలు నన్ను సినిమా చేసి పెట్టమని అడిగారు. అడ్వాన్స్ లు చేతిలో పెట్టబోయారు. అడ్వాన్స్ లు ఇచ్చారని కమిటైపోయి నేను సినిమాలు చేయలేను.నా మనస్సుకు నచ్చినప్పుడు తీస్తాననే వాడిని. అలా ఎవరి దగ్గరా అడ్వాన్స్ లు తీసుకోలేదు అన్నారు.