Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సెక్సీ ఫోటోపై బూతు కామెంట్స్: ఘాటుగా స్పందించిన హీరోయిన్...
ఓ అభిమాని ఆ ఫోటోను ఉద్దేశించి చేసిన బూతు కామెంట్ ఇపుడు వివాదంగా మారింది.
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన దిశా పటాని ఇపుడు ఓ వివాదంతో హాట్ టాపిక్ అయింది. ఈ వివాదానికి కారణం ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలే!
ఈ మధ్య హీరోయిన్లు తమ అందాలను వీలైనంత సెక్సీగా ప్రదర్శించేందుకు, అందరి దృష్టి తమ వైపుకు తిప్పుకునేందుకు, అందగత్తెగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండటం చూస్తూనే ఉన్నాం. అఫ్ కోర్స్ ఇదంతా వారి ప్రొఫెషన్లో భాగం. ఈ క్రమంలోనే దిశా పటానీ కూడా ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో తన ఎద అందాలను హాట్ హాట్ గా ఎక్స్ ఫోజ్ చేస్తూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది.
అవే ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులకు కను విందు చేసింది. అయితే ఓ అభిమాని ఆ ఫోటోను ఉద్దేశించి చేసిన బూతు కామెంట్ ఇపుడు వివాదంగా మారింది. అసభ్యంగా అతడు చేసిన కామెంట్లకు దిశా పటాని ఘాటుగా రిప్లై ఇచ్చింది.
వివాదానికి కారణమైన హాట్ డ్రెస్
దిశా పటానీ ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కు ఈ డ్రెస్సులోనే హాజరైంది. ఇందులో దిశా గతంలో కంటే హాట్ అండ్ సెక్సీగా ఎద అందాలను ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది.
బూతు కామెంట్స్
ఈ డ్రెస్సు మీద దిగిన ఓ ఫోటోను దిశా పటానీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనికి ఓ వ్యక్తి తీవ్రమైన కామెంట్స్ చేసాడు. నువ్వు నీ b**bs ఎక్స్ ఫోజ్ చేయడం వల్ల వేశ్యలా కనిపిస్తున్నావు, నువ్వు ఇంప్లాంట్స్ కలిగిఉన్నావన్న విషయాన్ని మేము గ్రహించాం, ఇలా ప్రదర్శించాల్సిన అవసరం లేదు అంటూ అసభ్యంగా కామెంట్ చేసాడు.
సోషల్ మీడియాలో దారుణంగా
సోషల్ మీడియా విస్తృతం అయిన తర్వాత నటీ నటులు కూడా అందులో యాక్టివ్ అయ్యారు. అయితే అప్పు డప్పుడు ఇలా కొందరి నుండి వారికి ఇలాంటి ఇబ్బందికర కామెంట్స్ ఏర్పడుతున్నాయి.
మనిషికి జంతువుకు అదే తేడా అంటూ దిశా పటానీ ఘాటుగా
ఈ క్రమంలో దిశా పటానీ తన ఇన్స్టా గ్రామ్ లో ఘాటుగా స్పందించింది. "ఆలస్యంగా వేధింపులు, అత్యాచారాలపై చాలా వార్తలు చదువుతున్నాను! దేవతలను పూజించే మన దేశంలో మహిళల పట్ల ఎవరూ తగినంత రెస్పెక్టబుల్ గా ఉండటం లేదు.... మనిషికి, జంతుకు తేడా అనేది ఆ రెస్పెక్టులోనే ఉంటుందనేది ఎవరూ గ్రహించడం లేదు అంటూ దిశా పటానీ ఘాటుగా స్పందించారు.
అక్కడే మీ చీప్ మెంటాలిటీ ఏంటో తెలిసిపోతోంది
మహిళలు వేసుకునే దుస్తులను బేస్ చేసుకుని...వారు సరిగా చర్మాన్ని కప్పుకున్నారా? లేదా? అనే కోణంలో చాలా మంది వారిని జడ్జ్ చేస్తున్నారు. నీచంగా ఆలోచించే మీ చీప్ మెంటాలిటీని మాత్రం మీరు జడ్జ్ చేసుకోవడం లేదు అంటూ దిశా పటానీ ఘాటుగా స్పందించారు.
హితబోధ
ఇప్పటికైనా కళ్లు తెరవండి. మేము ఏవరో కోరుకునే ఇండియన్ గర్ల్ గా ఉండదలుచుకోలేదు. మీ ప్రస్టేషన్ ఇతర జీవితాలను నాశనం చేయడానికి ఉపయోగించొద్దు, ఎందుకంటే రేపు మీ ఫ్యామిలీలో ఇలాంటివి జరిగితే మీరు సంతోషంగా ఉండలేరు. వంచన మానండి... ఓపెన్ మైండెడ్ గా ఉండండి అంటూ దిశా పటాని హితబోధ చేసారు.