Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నలభై ఏళ్లు అయినా నన్ను అలాగే పిలుస్తున్నారు
ముంబై: షోలేలో సినిమాలో భాగమైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని బాలీవుడ్ నటి హేమామాలిని అన్నారు. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమా 'షోలే' విడుదలై నేటికి నలభై ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఇలా స్పందించారు. ఆమె ఏం ట్వీట్ చేసారో ఇక్కడ చూడండి.
40
yrs
of
Sholay
&
still
going
strong.So
proud
I
was
part
of
such
an
iconic
movie!Ppl
still
call
me
Basanti
&
transport
me
to
tht
era
again!
—
Hema
Malini
(@dreamgirlhema)
August
14,
2015
సినిమా
వచ్చి
నలభై
ఏళ్లయినా
తనను
ఇప్పటికీ
షోలేలో
తాను
నటించిన
పాత్ర
పేరు
'బసంతి'
అని
పిలవడం
చాలా
ఆనందంగా
ఉందని
చెప్పారు.
1975లో
విడుదలైన
ఈ
ప్రముఖ
సినిమాలో
బాలీవుడ్
నటులు
అమితాబచ్చన్,
జయ
బాధురి,
హేమామాలిని,
ధర్మేంద్ర,
సంజీవ్
కుమార్,
అజ్మద్
ఖాన్
ముఖ్య
పాత్రల్లో
నటించారు.
రమేష్
సిప్పీ
దర్శకత్వంలో
వచ్చిన,
ఇంతమంది
ప్రముఖులు
నటించిన
ఈ
సినిమాలో
తాను
భాగమైనందుకు
గర్వంగా
ఉందని
హేమా
మాలిని
ట్విట్టర్లో
పోస్ట్
చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా చరిత్రకెక్కిన సినిమా 'షోలే". ఆగస్టు 15, 9175 లో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 15తో 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే.
ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదేమో. 36 ఏళ్ల కిందటే రూ. 3 కోట్లు వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 100కుపైగా థియేటర్లలో ఏకథాటిగా 25వారాలు(సిల్వర్జూబ్లీ) ప్రదర్శితమైంది.
ఆ తర్వాత ఈ సినిమాను 3డిలో కూడా విడుదల చేసారు. 40 ఏళ్ల క్రితం రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాదాపు రూ. 768 కోట్లకు పైగా వసూలు చేసినట్ల అంచనా. షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.