Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దేవిశ్రీప్రసాద్ ఎమోషన్ అయ్యిన క్షణాలుఆడియో లాంచ్
హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో ఆడియో పంక్షన్ నిన్న ఆదివారం సాయింత్రం విడుదలైంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా గురించి చేసిన త్యాగం గురించి ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆయనేం అన్నారో ఇక్కడ స్వయంగా చూడండి.
ఎన్టీఆర్ మాట్లాడుతూ- '' సత్యమూర్తిగారు చనిపోయిన రెండో రోజు దేవీకి మెసేజ్ చే శాను. అతను నాకు పంపించిన రిప్లైలో తన బాధతో పాటు పాటల రికార్డింగ్ స్టేటస్ని కూడా మెసేజ్ చేశాడు. మన వల్ల పని డిస్ట్రబ్ కాకూడదని సత్యమూర్తిగారు చెప్పిన మాటను దేవి పాటిస్తుంటాడు. 'నాన్నకు ప్రేమతో' ప్రపంచంలోని తండ్రులందరికీ ఇచ్చే నీరాజనం.'' అన్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు దేవిశ్రీప్రసాద్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
దేవిశ్రీ ప్రసాద్ మట్లాడుతూ- ''30 ఇయర్స్ నుంచి మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. మా అమ్మ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 'నాన్నకు ప్రేమ'తో పాటలను మా నాన్నగారికి అంకితం చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.
ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్ : రవీందర్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఎడిటింగ్ : నవీన్ నూలి, పాటలు : చంద్రబోస్, డాన్స్ : రాజు సుందర కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : సుకుమార్.