Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సన్నాఫ్ సత్యమూర్తి’ కి దేవిశ్రీప్రసాద్ పోస్టర్
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కోసం ఓ సాంగ్ ని సిద్దం చేసి ఇప్పటికే టీజర్ కూడా వదిలారు. ఇప్పుడు ఆ సాంగ వీడియో వెర్షన్ కు సంభందించిన పోస్ట్రర్ ని విడుదల చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో బన్నీ-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన జులాయి కోసం... అప్పట్లో ఓ ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. బన్నీతో పాటు దేవిశ్రీ ప్రసాద్ చిందేసిన ఆ స్పెషల్ సాంగ్ సినిమా ప్రచారానికి ఎంతో హెల్ప్ అయింది. దీంతో.. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి కోసం ఇలాంటిదే ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ సిద్ధం చేశారు దేవిశ్రీ.
మరోసారి-బన్నీ-దేవిశ్రీ కలిసి చిందేయనున్న ఈ పాటకు సంబందించి షూట్ కూడా పూర్తయింది.. రేపే ఈ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు... ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... ఓ టీజర్ కూడా విడుదల చేశారు. కాంబినేషన్ తో పాటు ప్రమోషన్ విషయంలోనూ 'జులాయి'నే ఫాలో అవుతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి అదే రేంజి హిట్ ని కొడతారని అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలుగా నటించారు. నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ త్రివిక్రమ్-అల్లు అర్జున్ మేలుకలయికలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే సూపర్హిట్ అయ్యాయన్నారు.
సెన్సార్వారు ఎటువంటి కట్స్ లేకుండా అనుమతి ఇచ్చారని, తెలుగు ప్రేక్షకులకు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెనె్నల కిశోర్, రావు రమేష్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్:రవీందర్, నిర్మాత:రాధాకృష్ణ.ఎస్., కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం:త్రివిక్రమ్.