Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క కూడా ఓ రాయి విసురుతోంది
హైదరాబాద్: సౌత్ లో హీరోయిన్ గా ఓ స్ధాయికి వెళ్లిన వాళ్లంతా బాలీవుడ్ పై కన్నేయటం సహజం. అక్కడ సక్సెస్ అయితే అవుతాం..లేదా మన సౌత్ సినిమాలు ఉండనే ఉన్నాయి...అనేది వారి ఆలోచన. బాలీవుడ్ లో నటిస్తే దేశం మొత్తం పాపులర్ అవుతామనేది వారి ఆలోచన. త్రిష,అశిన్, కాజల్, తమన్నా రూటులోనే ఇప్పుడు అనుష్క కూడా బాలీవుడ్ ప్రయాణం పెట్టుకుందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే...అనుష్క ఓ బాలీవుడ్ సినిమాను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'అమన్ కి ఆశ' చిత్రాన్ని రూపొందించిన ఇ.నివాస్ తన తదుపరి చిత్రంలో అనుష్కను బాలీవుడ్కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
''నేను అనుష్కకు ఓ కథ వినిపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అనుష్క నుంచి ఓకే అనే మాట వచ్చాకే చెప్పగలను. ఈ కథకు అనుష్క వందశాతం సరిపోతుందని ఆమెను సంప్రదించాను. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రావచ్చు''అని చెప్పారాయన.
సినిమా గురించి చెబుతూ ''ఈ చిత్రానికి 'జువీనల్' అనే పేరు ఖరారు చేశాం. మల్టీస్టారర్ చిత్రం. మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. భిన్న కథల సమ్మేళనంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది''అని చెప్పారు నివాస్. అనుష్క ప్రస్తుతం 'బాహుబలి' చిత్రీకరణలో బిజీగా ఉంది.