Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రిష,అనుష్క మధ్యలో మాస్ హీరో (ఫస్ట్ లుక్ ఫొటోలు)
హైదరాబాద్ :త్రిష, అనుష్క వీరిద్దరి మధ్యలో ఇరుక్కున్న వాడి పరిస్ధితి ఎలా ఉంటుంది. తెలుసుకోవాలని ఉందా అయితే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు గౌతమ్ మీనన్. ఆయన తాజాగా అజిత్ హీరోగా రూపొందిస్తున్న చిత్రంలో వీరిద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ వదలి అందరిని ఆకట్టుకున్నారు.
గత ఏడాది సంక్రాంతికి 'వీరం' (వీరుడొక్కడే)చిత్రం ద్వారా తన అభిమానులను ఆకట్టుకున్నారు నటుడు అజిత్. ఇప్పుడు సంక్రాంతి పురుషుడిగా మరోమారు సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. గౌతంమీనన్ దర్శకత్వంలో 'తల' అజిత్ నటించిన 'ఎన్నై అరిందాల్' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.
డిసెంబరు తొలి వారంలో ఆడియోను విడుదల చేయనున్నారు. తెలుగులో 'ఎంతవాడు గానీ..' అనే పేరుతో వస్తోంది. ఇందులో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో 'వీరం'గా తల అభిమానులను ఈ చిత్రం అలరిస్తుందేమో వేచి చూద్దాం.
ఆ ఫస్ట్ లుక్ ఫొటోలు, వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షోలో చూడండి...
భారీ అంచనాలు...
అజిత్ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా ఇది ఆయన 55వ చిత్రం కావడం మరో విశేషం.
వీరిద్దరూ చాలు..
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. అందాలభామలు అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ముఖ్య పాత్ర...
మరో విషయం ఏమిటంటే చిత్రంలో అదనంగా కేరళ కుట్టి పార్వతి నాయర్ వచ్చి చేరింది. ఈ అమ్మడి చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తోందట.
టైటిల్ మ్యాటర్ ..
ఈ చిత్రం టైటిల్ ఏమిటన్న విషయం గురించి చాలాకాలంగా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవేమీ చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించినవి కావు. తాజాగా అజిత్ చిత్ర టైటిల్ను ప్రకటించారు. ఈ చిత్రానికి ఎన్నై అరిందాల్ అనే పేరును ఖరారు చేశారు. తెలుగులో ఎంతవాడు గానీ అనే టైటిల్ ని ప్రకటించారు.
అనుష్కతో లిప్ లాక్...
శింబుతో నయనతార, బన్నీతో కాజల్, నాగచైతన్యతో సమంత ఇప్పటికే లిప్లాక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి అనుష్క కూడా చేరారు. ఇంతకీ అనుష్క అధరాలను చుంబించిన ఆ హీరో ఎవరో తెలుసా? అజిత్. ఈ చిత్రంలో ఈ సీన్ హైలెట్ అంటున్నారు.
చాలా బోల్డ్ గా...
కథ రీత్యా ఇందులో శృంగారభరితమైన ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్ని గౌతమ్ చాలా బోల్డ్గా తీశారని కోలీవుడ్ సమాచారం.
జాగ్రత్తలు..నిర్ణయాలు
తాను అనుకున్నట్లు ఆ సన్నివేశం రావడానికి గౌతమ్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారట. అలాగే ఆ సీన్ క్లిప్స్ బయిటకు వెళ్లకూడదని కూడా స్ట్రిక్ట్ గా చెప్పాడట. దాంతో యూనిట్ మొత్తాన్నీ బయటకు పంపించేసి, తాను, అజిత్, అనుష్క, కెమెరామేన్ మాత్రమే లొకేషన్లో ఉండి, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట.
రెచ్చిపోయి..
ఈ సీన్లో అజిత్, అనుష్క రెచ్చిపోయి నటించారని యూనిట్ సభ్యులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగానే వీరిద్దరితో లిప్లాక్ కూడా చేయించారట గౌతమ్. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ కానుందని కోలీవుడ్ టాక్.
చీరలో కేక..
ఈ చిత్రంలో మరోసారి త్రిషను చీరలో బహు సుందరంగా చూపించనున్నారట. స్టైలిష్ గెటప్లో అజిత్, చీర కట్టు సింగారంతో త్రిష నటించిన సన్నివేశాల్లో మెరిసిపోయారు.
ఫ్యాన్స్ పండుగ...
ఈ జంటను చూసిన అజిత్ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారట. తల (అజిత్) సరన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ త్రిషేనని, సరైన జోడి కూడా వీరేనని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నా యి.
గతంలోనూ...
దర్శకుడు గౌతమ్మీనన్ విన్నై తాండి వరువాయా చిత్రంలో త్రిషను చీరకట్టుతో ఆవిష్కరించిన జెస్సీ పాత్రను తమిళ ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. ఆ పాత్రకు లభించిన అప్లాజ్ త్రిష జీవితాంతం మరచిపోలేరు కూడా. ఆ తరువాత ఈ చెన్నై చిన్నదానికి అంత పేరు తెచ్చిన పాత్ర లేదన్నది నిజం. అందుకే త్రిష కూడా దర్శకుడు గౌతమ్మీనన్పై తన అభిమానాన్ని చాటుకుంటుంటారు.
ఆదుకుంటున్నాడు...
మరో విషయం ఏమిటంటే త్రిష మార్కెట్ పడిపోతుందనుకుంటున్నప్పుడల్లా గౌతమ్మీనన్ ఆమెకో అవకాశం ఇస్తూ ఆదుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అజిత్ సరసన నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం.
అటు అనుష్క ఫ్యాన్స్ ...
ఈ మధ్య అనుష్క సినిమాల్లో బొత్తిగా హాట్ సీన్లు లేకుండా పోయాయి అని నిరాశలో ఉన్న అభిమానులకు ఈ వార్తలు మరింత ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. గౌతం మీనన్ సినిమాలు డిఫరెంటుగా ఉంటాయి. రొమాంటిక్ సన్నివేశాలను ఆయన చూపించే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది. దీంతో సినిమాపై తమిళనాట ఇప్పటి నుండే అంచనాలు పెరుగుతున్నాయి.
అజిత్ కు తెలుగు నాట...
ప్రేమ లేఖ చిత్రం నాటి నుంచి అజిత్ కు తెలుగునాట మార్కెట్ ఉంటూ వచ్చింది. ఆయన చిత్రాలు ఇక్కడా బాగా ఆడుతూండటంతో ఇక్కడా బిజినెస్ బాగా జరుగుతోంది.
కాస్త నిరాశపరిచినా...
ఆ మధ్యన తెలుగులో అజిత్ ఆట ఆరంభం,వీరుడొక్కడే చిత్రాలు నిరాసపరిచినా ఓపినింగ్స్ మాత్రం ఫరవాలేదనిపించే రీతిలో వచ్చాయి. అంతేకాక శాటిలైట్ రైట్స్ సైతం భారీగా రావటంతో తెలుగు వెర్షన్ పై పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చింది.
గౌతమ్ మీనన్ కు సైతం..
నాగ చైతన్య తో ఏమి మాయ చేసావే చిత్రం ఇక్కడ హిట్ కొట్టి ఉండటంతో ఆయన సినిమాలకు ఇక్కడ ఓ వర్గం ప్రేక్షకులు అండగా ఉంటూ వస్తున్నారు.
అనుష్క
తెలుగులో అనుష్క కు ఉన్న క్రేజ్ చెప్పక్కర్లేదు. ఆమె ఇప్పుడు బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె చిత్రం అంటే అభిమానులకు ఆనందమే.
త్రిష
త్రిష
విషయానికి
వస్తే...
ఆమెకు
ప్రస్తుతం
పెద్ద
గా
ఆఫర్స్
లేవనే
చెప్పాలి.
బాలకృష్ణ
సరసన
నటిస్తున్న
ఆమె
సినిమాలకు
బిజినెస్
బాగానే
అవుతుంది.
ఇద్దరూ...
త్రిష, అనుష్క ఇద్దరూ కలిసి నటించటం అనేది ఇప్పటివరకూ జరగలేదు. ఈ సినిమాలో వీరిద్దరి అందాలు ఒకేసారి చూడవచ్చు అంటున్నారు.
శాటిలైట్ బిజినెస్...
త్రిష,అనుష్క, అజిత్ వీరు ముగ్గురూ ఉండటంతో చిత్రం శాటిలైట్ మార్కెట్ సైతం బాగుంటుందని అంచనా వేస్తున్నారు.
స్పెషల్ సాంగ్..
ఈ చిత్రంలో త్రిష ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం. ఆ పాట సినిమాకు బాగా ప్లస్ అవుతుందని యూనిట్ చెప్తున్నారు.
గతంలో చేయలేదు కానీ...
గౌతంమీనన్ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు.
పోలీస్ స్టోరీ...
అజిత్ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్కాతర్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.
లేటెస్ట్ ఇన్ఫో..
షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్ సన్నివేశాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
దుమ్ము రేపుతుందా
తెలుగులో ఈ పోస్టర్స్ చూడగానే అంతా దుమ్ము రేపే చిత్రం అని భావిస్తున్నారు. దానికి తోడు ..సంక్రాంతికి రానుండటంతో మంచి క్రేజే వస్తుందంటున్నారు. చూడాలి మరి దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుంటుందో.