Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ ప్లెక్సీలు ధ్వంసం...ప్రభాస్ ఫ్యాన్సే చేసారంటూ
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసంచేశారు. దీంతో రోడ్లపై పవన్ అభిమానులు ఆందోళనలు చేసి అనుమానితుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకూ అందిన వివరాలు...
పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ అభిమానులు ఆందోళన చేసారు. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ చింపారంటీ బీభత్సం సృష్టించారు. పవన్ పుట్టిన రోజు సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీ లను ఎవరో చింపేశారు. అయితే హీరో ఫ్రభాస్ అభిమానులే వాటిని చింపేశారంటూ ..పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ..ప్రభాస్ ఫ్రెక్సీలను చింపేసి, రోడ్డు మీద పడేసి నిప్పంచారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అంతేకాకుండా రోడ్డు ప్రక్కనున్న షాపులను కూడా ధ్వంసం చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ ఫ్యాన్స్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి సమయంలో రాస్తా రోకో చేసి...రోడ్డుపై నిప్పు పెట్టి హంగామా చేసారు. అనుమానితుల ఇళ్ళపై పవన్ అబిమానులు రాళ్ళతో దాడి చేసారు. వీరి ఆందోళనల ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజలు హడిలిపోయారు.