Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
చిరంజీవికి 'ఖైదీ', నాగార్జునకు 'శివ' ఎలాగో..అలాగే
హైదరాబాద్ : " చిరంజీవికి 'ఖైదీ', నాగార్జునకు 'శివ' ఎలా గుర్తుండిపోయాయో హవీష్కు మా 'జీనియస్' అలాగే గుర్తుంటుంది. జీనియస్ చూసి మారామని పలువురు హీరోల అభిమానులు మెసేజ్లు పంపిస్తుంటే ఆనందంతో కళ్ళు చమర్చాయి. నిర్మాతగా ఎన్ని కోట్ల కలెక్షన్లను లెక్క చూసుకున్నా, నేను పొందుతున్న ఆత్మసంతృప్తి ముందు అవన్నీ దిగదుడుపేననిపిస్తోంది. '' అని నిర్మాత దాసరి కిరణ్ అన్నారు. హవీష్ నటించిన 'జీనియస్'కు ఆయన నిర్మాత. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి,మాట్లాడారు.
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ "యువతకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. డైలాగులు, నటన సినిమాకు ప్లస్సయింది. ఫస్ట్ హాఫ్ చూసి కన్ఫ్యూజన్ ఉందని అంటున్నవారు సెకండ్ హాఫ్ చూసి మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో అందరికీ ఉన్నది కన్ఫ్యూజన్ కాదు. మేం స్క్రీన్ప్లేను అలా క్రియేట్ చేశాం. విద్యార్థులు జీనియస్ కావాలంటే మా సినిమాను ఒక్కసారైనా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది'' అని చెప్పారు.
"జీనియస్లు కావాల్సిన పిల్లలు, తమకు నచ్చిన వారికోసం సమయాన్ని వృథా చేస్తూ, జీవితాన్ని ఎలా పాడుచేసుకుంటున్నారన్న విషయాన్ని చాలా చక్కగా చూపించాం. తప్పక ప్రశంసలు దక్కుతాయని నేను చెప్పిన ప్రతి చోటా ప్రేక్షకులు స్పందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా పలు సినిమాలు వస్తాయి'' అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.