Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీనియర్ నటి కన్నుమూత...నివాళి
కటక్: ఒడియా సినీ రంగంలో పేరొందిన సినీనటి గ్లోరియా మహంతి (83) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా కటక్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 10.45 గంటలకు ఆమె శ్వాస విడిచారు. శుక్రవారం ఆమె పార్ధివ శరీరాన్ని దెవుళొసాహి ప్రాంతంలోని నివాసానికి తరలించారు. పలువురు సినీ నటులు, పోలీసు ఉన్నతాధికారులు అంతిమ దర్శనం చేసుకుని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం సతీచౌరా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి చెందే సమయానికి ఇద్దరు కుమారులు దేవి మహంతి, సత్య మహంతి, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు దగ్గర ఉన్నారు. గ్లోరియా 1949లో 'శ్రీ జగన్నాథ' చిత్రంలో తొలిసారిగా నటించారు. అనంతరం 42 చిత్రాల్లో హీరోయిన్గా, సహాయ నటిగా వివిధ పాత్రలు పోషించారు. పలు టెలీఫిల్మ్స్, టీవీ సీరియల్స్లో నటించారు. ఆమె నటించిన ఉల్కా, సాక్షి గోపినాథ్, పరివార్, కేదార్గౌరి, తపస్య చిత్రాలు ప్రజాదరణ పొందాయి.
1994లో ప్రభుత్వం ఆమెకు ప్రతిష్టాత్మక జయదేవ్ అవార్డును ప్రదానం చేసింది. సృజన్ సంస్థ, ఫిట్పాట్ సంస్థ, సంగీత నాటక అకాడమి ఇలా ఎన్నో సంస్థలు ఆమెను సత్కరించాయి. సినీ రంగంతో పాటు క్రీడల్లో కూడా ఆమె రాణించి అభినందనలు అందుకున్నారు. 1957 - 60 మధ్య రాష్ట్ర మహిళా వాలీబాల్ జట్టులో ఆడారు.
సినీనటులు కునా త్రిపాఠి, ఎమ్పీ అనుభవ్ మహంతి దంపతులు, నటి దీపాసాహు, నిర్మాత సంజయ్ సాహు పలువురు నటీనటులు, రాష్ట్ర రవాణా కమిషనర్ ఎం.అక్షయ్, మాజీ డీజీపీ అనూప్ పట్నాయక్, తదితరులు గ్లోరియాకు అంతిమ నివాళులర్పించినవారిలో ఉన్నారు.
రాష్ట్రం ప్రతిభావంతురాలైన నటిని కోల్పోయిందని, రాష్ట్ర సినీ జగతికి గ్లోరియా మృతి తీరని లోటని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఒడియా సినీ రంగం వికాసానికి గ్లోరియా మహంతి చేసిన కృషిని ప్రశంసించారు.