Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అవార్డుల పంక్షన్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: దర్శకత్వం వహించిన తొలి చిత్రం విశేష ప్రతిభ కనబరచిన ఉత్తమ భారతీయ చలనచిత్రానికి గత 17 సంవత్సరాలుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘గొల్లపూడి శ్రీనివాస్' స్మారక జాతీయ పురస్కారానికి ఈ ఏడాది 'క్యూ' హిందీ చిత్ర దర్శకుడు సంజీవ్ గుప్తా ఎంపికయ్యారు. చెన్నైలోని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో ఆగస్టు 12న ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అవార్డుతో పాటు రూ. 1.5 లక్షల నగదు అందజేసారు.
గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్, ప్రఖ్యాత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మూడో కుమారుడు 23 ఏళ్ల క్రితం విశాఖ సాగరతీరంలో 'ప్రేమ పుస్తకం' చిత్రం షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన స్మృత్యర్థం ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు వసంత్, సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నటి రోహిణిలతో కూడిన జ్యూరీ దేశంలో ఈ ఏడాది వివిధ భాషల్లో వచ్చిన 17 ఎంట్రీలను పరిశీలించి- ఉత్తమమైనది 'క్యూ'ను ఎంపిక ఎంపిక చేసారు.
ఈ అవార్డు కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ నుండి ఫరా ఖాన్, తమిళ నిర్మాత కార్తీక్ సుబ్బరాజు, నటి సుహాసిని హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ మధ్య కొన్ని సినిమా అవార్డుల పురస్కార ప్రధానోత్సవాలను నిర్వాహకులు స్కూల్ లో జరిగే అవార్డుల ఫంక్షన్ లా మార్చేసారు. కానీ గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రధానోత్సవం ప్రతి కుటుంబాన్ని టచ్ చేసే విధంగా ఉంటుందన్నారు.