Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘గోపాల గోపాల’ కేసు: లైట్ తీస్కుంటున్నారు!
హైదరాబాద్: ‘గోపాల గోపాల' సినిమాను నిలిపి వేయాలంటూ గతంలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ పిటీషన్ కోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ... పిటిషన్ను వెనక్కి తీసుకొని మరో పిటిషన్ దాఖలు చేయాలని, దర్శక, నిర్మాతలనూ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
వాస్తవానికి సినిమా విడుదలకు ముందు నుండే ఫిర్యాదులు, కేసుల హడావుడి మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా ఆగి పోతుందేమోనని అభిమానులు కంగారు పడ్డాయి. అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా ప్రదర్శితం అవుతూనే ఉంది. నిర్మాతలకు ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చి పెట్టింది. బాక్సాఫీసు వద్ద కూడా సినిమా బిజినెస్ క్లోజింగుకు వచ్చింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజా పరిణామాల నేపథ్యంలో అభిమానుల్లో గతంతో పోలిస్తే కంగారు లేనే లేదు. అసలు ఈ సినిమాపై దాఖలవుతున్న కేసులను ఇపుడు అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వారికి కావాల్సింది సినిమా చూడటం. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి వాళ్లలు ఎలాంటి టెన్షన్ లేదు.
మరో వైపు దర్శకులు, నిర్మాతలు కూడా ఈ కేసుల విషయమై పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ హిందీలో తెరకెక్కిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్. గతంలోనూ ‘ఓ మై గాడ్' చిత్రంపై కూడా ఇలాంటి కేసులు నడిచిన సంగతి తెలిసిందే. అందు వల్ల దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రంపై పలువురు వేస్తున్న పిటీషన్లను, గొడవలను లైట్ తీస్కుంటున్నట్లు తెలుస్తోంది.