Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దిమ్మదిరిగే రేటుకు ‘గోవిందుడు...’ శాటిలైట్ రైట్స్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం శాటిలైట్ రైట్స్ దిమ్మదిరిగే రేటుకు అమ్మడు పోయాయి. ఫిల్మ్ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాలకు బుల్లితెరపై మంచి ఆదరణ ఉండటం, ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో జెమినీ టీవీ వారు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.
కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 1న గ్రాండ్గా విడులవుతోంది.
రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలకు భిన్నంగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టెనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1800లకు పైగా థియేటర్లలో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో జంతువులను చూపించారు. దీంతో జంతు సంరక్షణ సమితి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని సెన్సార్ బెర్డు వారు సూచించారు. దీంతో పాటు ఎక్స్ ఫోజింగ్ ఎక్కువగా ఉన్న సీన్లకు కూడా సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.