Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఏపీలో సినీ స్టూడియో నిర్మించబోతున్న నటి హేమ
హైదరాబాద్: భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని తాను కోరుకుంటున్నానను, వస్తుందనే నమ్మకం ఉంది...అందకే రాజమండ్రి- రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు నటి హేమ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం వచ్చిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నాను. జిల్లాలో సినిమా షూటింగ్స్కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు.
ఇటీవల ‘మా' ఎన్నికల నేపథ్యంలో హేమ, శివాజీ రాజా మధ్య గొడవ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ విషయమై హేమ స్పందిస్తూ....‘మా' ఎన్నికల సందర్భంగా పోటీ వాతావరణం నెలకొన్న మాట వాస్తవమే. ఆ వేడి ఎన్నికల వరకు మాత్రమే పరిమితం. ‘మా'లో ఎలాంటి విబేధాలు లేవు అన్నారు.
గత 25 ఏళ్లుగా విరామం లేకుండా నటిస్తున్నాను. ఏడో తరగతి చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. భలేదొంగలు సినిమాలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను అన్నారు. ఇంతవరకూ 465 సినిమాల్లో నటించాను అని తెలిపారు.