Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ "జనతా గ్యారేజ్" సెట్ లో నితిన్ కి ఏం పని?
అఆ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నితిన్. అదే ఆనందం లో అందరినీ ఒకసారి అలా పలకరించి వస్తున్నాడు.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం "జనతా గ్యారేజ్" సెట్స్ లో హీరో నితిన్ సందడి చేశాడు. యంగ్ టైగర్ తో కలిసి సెల్ఫీదిగి... సెట్ లో అందరినీ పలకరించి. షూటిన్గ్ చూసి వచ్చాడు. అయితే కేవలం షూటింగ్ చూడటానికేనా లేదంటే ఏదైనా వేరే కారణం ఉందా అంతూ చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు .
అక్కడికి వెళ్ళిన సంగతి చెప్తూ "జనతా గ్యారేజ్ సెట్స్కు శుక్రవారం వెళ్లాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ను కలిశాను. ఆయన డ్యాన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది" అని ట్విటర్ లొ పోస్ట్ చేసాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే.
మరో వైపు నితిన్ హిరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.
వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్ కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో చిత్రాన్ని అద్భుతంగా తీసిన త్రివిక్రమ్కు నితిన్ థాంక్స్ చెప్పాడు.