Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాహుబలి.... పిల్ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కితున్న ‘బాహుబలి' చిత్రంపై టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరకుగుతున్నాయని గురువారం పిల్(ప్రజా ప్రయోజనాల వాజ్యం) దాఖలైన సంగతి తెలిసిందే. నరసింహ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేసారు. ఈ వాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సినిమాపై హైప్ పెంచారు, దీంతో అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఈ తరుణంలో థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనను పరిమితం చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.
కాగా... ఈ రోజు విడుదలైన బాహుబలి సినిమా మంచి స్పందన వస్తోంది. అభిమానులు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రిటిక్స్ నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని, గ్రాండ్ లుక్ ఉందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందని అందరూ ఒప్పుకుంటున్న మాట.