Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రోజులు మారాయి: ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాత మారుతి!
హైదరాబాద్: ఈ మద్య తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకెలుతున్న ఫిల్మ్ మేకర్ మారుతి. దర్శకుడిగా నిర్మాతగానే కాదు....రచయితగా కూడా మారుతి తన సత్తా చాటుతున్నాడు. త్వరలో విడుదల కానున్న రోజులు మారాయి చిత్రానికి రైటర్ ఈయనే. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి రైటర్ గా మంచి పారితోషికం పుచ్చుకున్న మారుతి.. లాభాల్లో కూడా వాటా అందుకోబోతున్నాడట.
మరో వైపు రాజ్ తరుణ్ హీరోగా ప్రారంభం కానున్న 'రాజుగాడు' అనే సినిమాకి కూడా మారుతి స్క్రిప్ట్ అందించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాతల నుంచి కోటికి పైగా చెక్ ను అందుకున్నాడట. ఇప్పటి వరకు ఈ రేంజి రెమ్యూనరేషన్ అందుకున్న రచయిత త్రివిక్రమ్ మాత్రమే. ఆయన తర్వాత మారుతి మాత్రమే కేవలం రయితగా కోటికిపైగా రెమ్యూరేషన్ అందుకున్నాడని అంటున్నారు.
మారుతి తాజా సినిమా 'రోజులు మారాయి' జులై 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మారుతి సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. 'రోజులు మారాయి' కథ రియల్ లైప్ ఆధారంగా జరిగిన సంఘటన నుండి తయారు చేసిందే అన్నారు.
ఓసారి పేపర్లో లవ్, రిలేషన్ షిప్స్లో అమ్మాయిలు ఓ అబ్బాయిని చంపేశారని చదివాను. ఆ ఆర్టికల్ చదువుతుంటే రోజులుమారాయి కథ నా ఆలోచనకు వచ్చింది. ఆ ఆర్టికల్ను ఫన్నీగా మలుచుకుంటూ నేను, డైరెక్టర్ మురళి, రైటర్ రవి కలిసి ఆ పాయింట్ను డెవలప్ చేశామని మారుతి తెలిపారు.