Don't Miss!
- News మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
నా దృష్టిలో వాటికి విలువ లేదు: రాజమౌళి
హైదరాబాద్ : అవార్డులపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. కేరళలోని కోవలమ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా)లో బాహుబలి నామినేషన్కు సంబంధించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు గాను ఆయన పై విధంగా స్పందించారు.
తనకు అవార్డులపై అంత ఆసక్తి ఉండదని తన దృష్టిలో వాటికి ఎలాంటి విలువ లేదన్నారు. అయితే తన చిత్రంలో పనిచేసిన వారికి ఎవరికైనా అవార్డులు వస్తే మాత్రం సంతోషిస్తానన్నారు. ఎందుకంటే అవి వారికి ప్రోత్సాహాన్నిస్తాయని తద్వారా వారు ఇంకా బాగాపని చేసేందుకు ఆసక్తి చూపుతారని తెలిపారు
‘బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితుల ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.
పలు అంతర్జాతీయ పత్రికలలో సైతం ‘బాహుబలి' గురించి మెయిన్ హెడ్డింగ్ లలో వచ్చింది, అంతేకాకుండా బుసాన్ వంటి ప్రముఖ ఇంటర్నేషనల్ వర్షన్తో ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ ప్రదర్శితమవుతోంది. ఇక ఈ ఫెస్టివల్స్లో వచ్చిన క్రేజ్ ద్వారా మరికొన్ని రోజుల్లో చైనా, జపాన్లలో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ విడుదల కానుంది.