Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి తప్ప అందరూ.., ‘అఖిల్’పై వినాయక్ క్షమాపణ
హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ తెరకెక్కించిన ‘అఖిల్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా ప్లాపైన తర్వాత వినాయక్ అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. తాజాగా ఏలూరులో సినీరిప్రజంటేటర్స్ కు ఎల్ ఐ సీ బాండ్ల పంపిణీ కార్యక్రమంలో వినాయక్ ఈ విషయమై స్పందించారు.
అఖిల్ సినిమా విషయంలో తప్పుజరిగిందని, ఈ విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలని ఆయన అన్నారు. కథ కొత్తఉందని ఆ సినిమా తీసానని, ఈ విషయంలో తాను తప్పు చేసానని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి తప్ప అందరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారు. తొలిసారి తాను తప్పు చేసినట్లు ఫీలవుతున్నాను, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పు చేయను అని తెలిపారు.
చిరంజీవి
150వ
సినిమాకు
వినాయక్
దర్శకత్వం....
చిరంజీవి
150వ
సినిమా
గురించి
రామ్
చరణ్
ఇటీవల
ఫిల్మీబీట్
స్పెషల్
ఇంటర్వ్యూలో
స్పష్టం
చేసిన
సంగతి
తెలిసిందే.
తమిళంలో
హిట్టయిన
‘కత్తి'
సినిమాను
చిరంజీవి
హీరోగా
తెలుగులో
రీమేక్
చేయబోతున్నారు.
ఈ
చిత్రానికి
వివి
వినాయక్
దర్శకత్వం
వహించబోతున్నారు.
చిరంజీవి 150వ సినిమాను జనవరి, 2016లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సురేఖ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఠాగూర్ మధు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నారు.