Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
బాహుబలి సినిమా నచ్చలేదు: స్టార్ డైరెక్టర్ కామెంట్
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దాదాపు రూ. 650 కోట్ల వసూళ్లు సాధించి సౌతిండియా సినిమా పరిశ్రమలో రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి తొలి భాగం చూసిన వారంతా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రముఖ సౌతిండియా దర్శకుడు గౌతం మీనన్ మాత్రం ‘బాహుబలి' లాంటి సినిమాలు తనకు నచ్చవని అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి లాంటి సినిమాలు నాకు నిజంగా నచ్చవు. ఎందుకంటే నేను ఫాంటసీ కథలకు అభిమానిని కాదు. టీవీలో కూడా గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ వంటి కాకుండా మహిళా సీరియళ్లే ఇష్టపడతాను' అని చెప్పుకొచ్చాడు.
గౌతం మీనన్ ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. తాజాగీ ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమా రాబోతోంది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రోడ్డుపై బైక్ ఉండటాన్ని బట్టి ఇదొక అడ్వెంచరస్ రోడ్ ట్రిప్పుకు సంబంధించిన కాన్సెప్టుతో సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే టైటిల్ లోగోలో ‘సాగిపో'..అనేది ‘పారిపో' అనిపించేలా డిజైన్ చేసారు. దీన్ని బట్టి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపోతాడా... లేక పారిపోతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
‘ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... ‘సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేయబోతున్నారు. ‘ఏ మాయ చేసావె' టైటిల్ మాదిరిగానే ఈ టైటిల్ కూడా ఒక్కడు మూవీ సాంగ్ లిరిక్ నుండి తీసుకున్నదే కావడం గమనార్హం. సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు పిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.