Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘బాహుబలి’కి ప్రశంసలు....రాజమౌళి ఖుషీ
హైదరాబాద్ : ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి'. ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. చిత్రం ప్రారంభం నుంచి అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇటీవల బల్గేరియాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. బల్గేరియాలోని భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్దేవ్ ‘బాహుబలి' టీమ్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ విషయమై ట్విట్టర్ లో రాజమౌళి షేర్ చేసి తాను చాలా హ్యాపీ ఫీలవుతున్నట్లు తెలిపారు.
https://www.facebook.com/TeluguFilmibeat
నిర్మాతలు మాట్లాడుతూ ‘‘బల్గేరియాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో భారత రాయబారి రాజేశ్ కుమార్ సచ్దేవ్ తన కుటుంబంతో కలిసి ‘బాహుబలి' సెట్స్ని సందర్శించారు. పోరాట సన్నివేశాల్ని, సెట్స్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభాస్, తమన్నా, రాజమౌళితోపాటు మా టీమందరితో మాట్లాడారు. భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకుని చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు'' అని తెలిపారు.
సినిమా షెడ్యూల్ గురించి వివరిస్తూ ‘‘సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్యాచ్వర్క్, మైనర్ టాకీ, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజా షెడ్యూల్ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.