Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కావాలని చేసిన తప్పు కాదది...అనుష్క వివరణ
ముంబై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాంకి ట్విట్టర్లో నివాళులర్పించే క్రమంలో ఆయన పేరును తప్పుగా రాసి బాలీవుడ్ నటి అనుష్కశర్మ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలోనూ,సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేగింది. ఈ విషమయై ఆమె వివరణ ఇచ్చారు.
కలాం పేరు తప్పుగా రాయాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు. మనుషులన్నాక తప్పులు చేయడం సాధారణమే కదా అని ఆమె అన్నారు. తాను చేసింది ఆనెస్ట్ మిస్టేక్ అని అనుష్క పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుండెనొప్పితో సోమవారం మృతిచెందారు. ఆయనకు ట్విట్టర్లో నివాళులర్పిస్తూ అనుష్క కలాం పేరును 'ఏపీజే' కి బదులుగా 'ఏబీజే' అని, అబ్దుల్ కలాం 'ఆజాద్' అని రెండుసార్లు తప్పుగా ట్వీట్ చేశారు. అనంతరం ఆ ట్వీట్స్ని తొలగించి మూడోసారి కరెక్టుగా రాశారు. దీంతో ఆమెని విమర్శిస్తూ పలువురు వ్యాఖ్యలు రాశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రెండో సారీ కలాం పేరు తప్పుగానే రాసింది. అనంతరం ఆ ట్వీట్ని కూడా తొలగించి, మూడోసారి కలాం పేరు సరిగా రాస్తూ నివాళులర్పించింది. అప్పటికే అనుష్క... రెండు సార్లు తప్పుగా రాయడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం మూడోసారికైనా సరిగా రాశావు సంతోషం అంటూ ఒకరు, మూడోసారైనా సరిగా రాసి.. ట్వీట్ని తొలగించవని అనుకుంటున్నా.. అని మరొకరు అలా ఆమె ట్వీట్లపై విమర్శలు గుప్పించారు. ఫైనల్ గా సరిగ్గా ట్వీట్ చేసింది.