Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నటి జయప్రదకు ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ’ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ నటి జయప్రద ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ' అవార్డుకు ఎంపికయ్యారు. దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డును మంగళవారం ముంబైలో ఆమెకు అందసారు. ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, సినీ రంగానికి భవిష్యత్తులో కూడా సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయప్రద.....హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ తరుపున ఎంపీగా గెలుపొందింది.
జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి లో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించినది. ఈమె 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడింది.14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వార ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ మరియు బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించినది.