twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ వెండి తెరపైకి జయప్రద

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సౌతిండియా సినిమాలతో పాటు బాలీవుడ్ పరిశ్రమల్లో వెండితెరను ఏలిన తెలుగు నటి జయప్రద. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన హవా కొనసాగించిన ఆమె తర్వాత రాజకీయాల బాట పట్టారు. అప్పటి నుండి ఆమె సినిమాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. మధ్య మధ్యలో కొన్ని టీవీ కార్యక్రమాలు మాత్రం చేసారు.

    2013లో కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ మూవీ ‘రజ్జో'లో ఓ చిన్న పాత్ర చేసిన జయప్రద......ఈ సారి మళ్లీ పూర్తి స్థాయిలో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ మూవీలో ఆమె రాణి సాహిబా అనే పాత్ర చేస్తున్నారు.

    Jaya Prada returns to movies!

    తన పాత్ర గురించి జయప్రద వివరిస్తూ....‘ఈసినిమాలో నేను పోషిస్తున్న రాణి సాహిబా పాత్ర గ్లామరస్ గా ఉంటూనే గ్రే షేడ్స్ ఉంటాయి. సినిమాలపై ప్రజల అభిప్రాయం మారింది. ఇప్పటి తరం వారు డిఫరెంట్ స్టోరీస్ కోరుకుంటున్నారు. రాణి సాహిబా తరహా క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. నేను ఈ సినిమా చేయడం అనేది చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. దర్శకుడు సంజయ్ శర్మ మీద నమ్మకం ఉంది' అని తెలిపారు.

    ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా మలేషియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో షూటింగ్ జరుపుకోబోతోంది. దీంతో పాటు ఓ మళయాల చిత్రంలో కూడా జయప్రద నటిస్తోంది.

    English summary
    Actress-politician Jaya Prada is returning to films with a lead role in director Sanjay Sharma’s paranormal thriller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X