Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
రామ్ చరణ్ చిత్రానికి జూ ఎన్టీఆర్ వాయిస్!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్న నాలుగు కుటుంబాల హీరోల మధ్య పోటీ వాతావరణం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక వారి అభిమానుల మధ్య వాతావరణం ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఒక హీరో మరొక హీరో సినిమా కోసం పని చేయడం ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా' కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో హైలెట్. తాజాగా రామ్ చరణ్ సినిమాకు జూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా ఎన్టీఆర్ ను సంప్రదించి ఇందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్చరణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తూ కనపడతాడు. రామ్చరణ్తో ఆయన శ్రీనువైట్ల చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్పై ఉంది. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్ ఫైట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్ ఫైట్ మాస్టర్గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.
ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్చరణ్లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.