Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు గుణశేఖర్కి కె.వి.రెడ్డి అవార్డ్
హైదరాబాద్: యువ కళావాహిని ఆధ్వర్యంలో సాంస్కృతికబంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో ప్రతి ఏటా జగదేకదర్శకుడు కె.వి.రెడ్డి పేరుమీద ప్రధానం చేస్తున్న చలనచిత్ర దర్శక పురస్కారం ఈ సారి ప్రముఖ తెలుగు దర్శకుడు గుణశేఖర్ అందుకోబోతున్నారు.
ఈ 30వ చలనచిత్ర దర్శక పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్ లోని ప్రసాద్ పిలింల్యాబ్ లో ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, దర్శకరత్న దాసరి నారాయణరావు హాజరవుతున్నారు.
విశిష్ఠ అతిథిగా ప్రసాద్ ఫిలింల్యాబ్ అధినేత అక్కినేని రమేష్ ప్రసాద్ హాజరవుతున్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించనున్నారు. గౌరవ అతిథులుగా చలసాని అశ్వినీదత్, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి, , జివి. నారాయణరావు, యం.వి.ఎస్ హరనాథరావు, యం దివాకరబాబు, తోట ప్రసాద్, ఎ.కె.అయ్యంగార్ హాజరవుతున్నారు.
అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా అంటే మధ్యాహ్నం 3.15 గంటలకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి' చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించబోతున్నారు.