Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్-వక్కతం వంశీ చిత్రం
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల తన సొంత బేనర్లో హీరోగా చేసిన ‘పటాస్' చిత్రం మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత హిట్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. తముడు ఎన్టీఆర్ తో కూడా తన రిలేషన్ షిప్ క్లోజ్ అవ్వడం కూడా కళ్యాణ్ రామ్ ఆనందానికి మరో కారణం. ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు సిద్దమవుతున్నాడు.
ఫిల్మ్ నగటర్ సమాచారం ప్రకారం...కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రానికి వక్కతం వంశీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వంశీ ఎన్టీఆర్ కి స్క్రిప్టు చెప్పడం, ఎన్టీఆర్ ఓకే చెప్పడం తెలిసిందే. ప్రస్తుతం వంశీ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. దర్శకుడిగా తన తొలి సినిమా కావడంతో వక్కతం వంశీ చాలా కేర్ ఫుల్ గా వర్క్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
నందూమరి బ్రదర్స్ కాంబినేషన్లో సినిమా వస్తే.... వసూళ్ల పరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే తాటిపైకి రావడం అభిమానుల్లో ఆనందం నింపుతోంది. మరో వైపు బాబాయ్ నందమూరి బాలయ్యతో కూడా కళ్యాణ్ రామ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
2015 సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అంటూ ‘పటాస్' సినిమా మొదలైనప్పటి నుండి చెబుదున్నారు. చెప్పినట్లుగానే ‘పటాస్' హిట్టయింది. ‘టెంపర్' విజయంతో ఈ వాదన మరింత బలపడింది. రాబోయే బాలయ్య సినిమా ‘లయన్' కూడా హిట్టయితే ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అనే మాట పరిపూర్ణమవుతుంది.