Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఫిల్మ్ ఫెస్టివల్కు ‘కంచె’?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా రొటీన్ సినిమాలే వస్తుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే ‘కంచె' లాంటి పాత్బ్రేకింగ్ సినిమాలు వస్తుంటాయి. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె' చిత్రాన్ని ఇటు ప్రేక్షకుల నుండి, అటు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చిత్రాన్ని రూ. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ సినిమా చూడటానికి మాత్రం రూ. 50 కోట్ల సినిమాలా రిచ్ లుక్ వచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా కోసం దర్శకుడు పడ్డ కష్టం వృధా కాలేదు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జరిగే పలు ఫేమస్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఈ సినిమాను పంపాలనే ఆలోచనలో ఉన్నాడు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్దం నాటి కొన్ని పరిస్థితులను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు... ఇండియన్ సినిమా పరిశ్రమలోనే ఇప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా రాలేదు. అప్పటి యుద్ధవాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపడంలో దర్శకుడు క్రిష్ సఫలం అయ్యాడు.