Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కర్ణాటక లో బాహుబలి 2 కి ఎదురు దెబ్బ, విడుదల కానివ్వం అంటూ
దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా బాహుబలి-2 సినిమా విడుదల కోసం చూస్తుంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ కన్నడ సంఘాలు నిరసన గళం ఎత్తుకున్నాయి.
దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా బాహుబలి-2 సినిమా విడుదల కోసం చూస్తుంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ కన్నడ సంఘాలు నిరసన గళం ఎత్తుకున్నాయి. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషిస్తున్న సత్యరాజ్.. ఓ కెట్టప్ప (ఈ మాటకి చెడ్డవాడు అనే అర్థం ఉంది).. ఆయన సినిమా మాకొద్దప్పా అంటూ మంగళవారం బెంగళూరులోని ఫిలించాంబర్ వద్ద ధర్నాకు దిగాయి.
ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ
గతంలో కావేరీ పోరాట సమయంలో ఆయన కన్నడ నేతలను అవహేళన చేస్తూ మాట్లాడారని, ఆయన సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ నిరసన తెలిపారు. ఈ ధర్నాలో కర్ణాటక రక్షణ వేదిక నేత ప్రవీణ్శెట్టితోపాటు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సారా గోవిందు కూడా పాల్గొన్నారు.
కావేరీ జలాల పంపిణీ
తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖులూ ఒక భాగమే నన్న విషయం తెలిసిందే కదా., జల్లికట్టు వివాదమైనా, జయలలిత మరణమైనా, చెన్నై వరదలైనా ఇలా తమిళనాడు రాజకీయాంశం ఏదైనా సినిమా జనం కూదా అందులో ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని దశాబ్దాలుగా తమిళ, కన్నడ రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల పంపిణీ విషయమై జరిగే గొడవ దేశం మొత్తానికీ తెలుసు.
కాస్త దూకుడు గానే మాట్లాడాడు
అయితే పోయిన సంవత్సరం ఈ జలాల విషయమై ఆందోళన జరిగినప్పుడు. తమిళనాడు తరపున నిలబడ్డ సత్యరాజ్ కాస్త దూకుడు గానే మాట్లాడాడు. కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలు వదిలితే దక్షిణ కర్ణాటక తాగునీటి ఎద్దడిని ఎదుర్కుంటుందని వాదిస్తోంది. కావేరి నీటి విడుదల జరగకపోతే నీరందక పంటలు ఎండిపోతాయని తమిళనాడు మాట్లాడుతోంది. ఉభయతారకంగా రెండు రాష్ట్రాలు కృషిచేయకపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయి.
క్షమాపణ చెప్పాల్సిందే
కర్ణాటక లో బాహుబలి విడుదల కావాలంటే సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గనక సత్య రాజ్ క్షమాపణ చెబితే తమిళ ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు తమిళనాడులోనూ బాహుబలి కి చిక్కులు తప్పవు. రెండురాష్ట్రాలమధ్య గొదవ ని బాహుబలి ఎలా గెలుస్తాడో ఏమో చూడాలి...