Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సంపూ ఎంట్రీ అదిరింది(వీడియో)
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తితో దర్శకుడు కత్తి మహేష్ కుమార్ ‘పెసరట్టు' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ‘100% లవ్', ‘ఆటో నగర్ సూర్య' సినిమాల ఫేం నందు, తను మొన్నే వెళ్లిపోయింది ఫేమ్...నిఖితా నారాయణ కాంబినేషన్ లో రెడీ అయిన ఈ చిత్రం ఆడియో నిన్న రాత్రి విడుదలైంది. ఈ నేపధ్యంలో చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ చివర్లో సంపూర్ణేష్ బాబు వచ్చి కిక్ ఇచ్చి వేడిక్కించారు. ఈ టీజర్ ని మీరూ ఓ లుక్కేయండి...
‘ఐస్ క్రీం' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఫ్లోకామ్ టెక్నాలజీను పరిచయం చేయడంతో పాటు మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు ముందు రెమ్యునరేషన్ ఇవ్వకుండా, హిట్ అయితే లాభాలలో వాటా ఇస్తారు. ఇదే స్కీమ్ లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్తున్నారు దర్శక,నిర్మాతలు. అలాగే తొలి తెలుగు క్రౌడ్ ఫండింగ్ చిత్రంగా దీన్ని రెడీ చేసామంటున్నారు.
నందు, నికిత నారాయన్ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో క్లాప్ బోర్డు స్టూడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్టైన్మెంట్స్, రిచెర్డ్ మీడియా ఎంటర్టైన్మెంట్, పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పెసరట్టు'.
నిశ్చితార్ధం, పెళ్లి నేపద్యంలో కథను ‘పెసరట్టు' సినిమా కథను రెడీ చేశారు కత్తి మహేష్. సెటైరికల్ కామెడీకి పెద్ద పీట వేస్తున్నామని చెప్తున్నారు. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. సినిమాలో మొత్తం 32 సన్నివేశాలు ఉంటాయి. నటీనటులకు 14 రోజుల వర్క్ షాప్ నిర్వచించిన తర్వాత షూటింగ్ చేసారు. 7 రోజులలో షూటింగ్ పూర్తి చేసారు. ఘంటశాల విశ్వనాద్ సంగీతం అందిస్తున్నారు.
కత్తి మహేష్ మాట్లాడుతూ ....వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో జరిగే కథ ఇది. వ్యంగ్యం, సునిశితమైన హాస్యం మేళవింపుతో వుంటుంది. అంతర్లీనంగా ఓ సీరియస్ అంశాన్ని చర్చిస్తూ సాగుతుంది. ఈ సినిమా ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఇందులో నాలుగుపాటలున్నాయని సంగీత దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, ఆర్ట్: ధర్మేంద్ర, ఎడిటర్: శంకర్, రచన: అరిపిరాల సత్యప్రసాద్, నిర్మాతలు: శ్రీనివాస్ గునిశెట్టి, ఈడుపుగంటి శేషగిరి, డిజీ సుకుమార్.