Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సినీనటి కుమార్తె అదృశ్యం.. కేసు నమోదు
కాగా ఆమె అంతకుముందు ఓ పాన్ బ్రోకర్స్ సంస్థలో తన వద్దనున్న గొలుసును, ఉంగరాన్ని తాకట్టుపెట్టి రూ.83వేలను తీసుకువెళ్ళింది. అనంతరం అమీర్పేటలోని తమకు పరిచయం ఉన్న ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకులకు కారును, పాన్బ్రోకర్ చిట్టీలను అప్పగించి ఓ యువకుడితో కరీంనగర్ వెళ్లి అక్కడ అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసు బృందం కరీంనగర్ వెళ్లి ఆమెను, ఆ యువకుడిని నగరానికి తీసుకువస్తున్నట్లు సమాచారం.
మాధురి కరీంనగర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుంది. మాధురి తన కారు డ్రైవర్ రాజ్కుమార్ను ప్రేమవివాహం చేసుకోవటం అంతటా చర్చనీయాంసంగా మారింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఆలయానికి వె ళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్కు, రాజ్కుమార్ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మాధురి బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో రాజ్కుమార్పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకున్నామని తెలిపారు.