Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బాహుబలి, బజ్రంగి భాయిజాన్....ఆ ఐడియా కీరవాణి ఇచ్చారట!
హైదరాబాద్: ఇటీవల విడుదలైన తెలుగు మూవీ ‘బాహుబలి', హిందీ మూవీ ‘బజ్రంగి భాయిజాన్' బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు నమోదు చేసాయి. వందల కోట్లు కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు కథ అందించింది ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి కీలకమైన ఐడియాలు సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చినవేనంట. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ స్వయంగా వెల్లడించారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' తెలుగు సినిమా చరిత్రలోనే ఓ పెద్ద హిట్. సినిమా చివర్లో బాహుబలికి ఎంతో నమ్మకస్తుడైన కట్టప్ప అతన్ని పొడవటం....క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్. ఈ సీన్ కారణంగానే జనాలు సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఈ సీన్ సినిమా మధ్యలో ఎక్కడో ఒక చోట పెడదామనుకున్నారట. అయితే మధ్యలో కాకుండా సినిమా చివర్లో పెడితే బావుంటుందని, సెకండ్ పార్ట్కు హైప్ పెంచినట్లవుతుందనే ఐడియా కీరవాణి ఇచ్చారట.
ఇక బజ్రంగి భాయిజాన్ సినిమాకు సంబంధించి.........ఏదో ఒక దేశం నేపథ్యం ఎంచుకోవాలని రచయిత అనుకున్నారు. ఏదో ఒకటి కాకుండా పాకిస్థాన్ నేపథ్యం ఎంచుకుంటే భావోద్వేగాలు బాగా పండుతాయనే సలహా కీరవాణి ఇచ్చారని, అందు వల్లే ఆ సినిమాలో భావోద్వేగాలు బాగా పండాయని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.