Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షూటింగ్లో గాయపడిన '1 నేనొక్కిడినే' హీరోయిన్
హైదరాబాద్: మహేష్ బాబు సరసన 1 నేనొక్కిడినే చిత్రంలో నటించిన కృతి సనన్ గుర్తుంది కదా. ఆ తర్వాత ఆమె నాగ చైతన్య తో దోచెయ్ చిత్రం చేసింది. కానీ తెలుగులో కంటిన్యూగా ఆఫర్స్ రాకపోవటంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
అందులో బాగంగా కృతిసనన్ ప్రస్తుతం సుషాంత్ సింగ్ రాజ్పుత్కి జంటగా రాబ్తా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరుగుతోంది. సినిమాలో కృతి ఓ భవనంపైకి ఎక్కి పరిగెత్తే సన్నివేశం చేయాల్సి ఉంది. షూటింగ్ సమయంలో కృతి ప్రమాదవశాత్తూ కిందపడింది.
అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకపోయినా కాలికి స్వల్ప గాయమైంది. చిత్రబృందం వెంటనే వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.