Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మేమంతా ముస్లింలమే’ అంటున్న మంచు లక్ష్మి
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వారిలో నటి మంచు లక్ష్మి ఒకరు. తాజాగా ఆమె తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. ‘మేమంతా ముస్లింలమే' అంటూ మంచు లక్ష్మి ప్లకార్డు ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది. ‘స్టాండప్ ఫర్ హ్యుమానిటీ, హ్యూమానిటీ లవ్, ఫ్యూచర్ అనే ట్యాగ్స్ తగిలించి మంచే లక్ష్మి ఈ ఫోటో పోస్టు చేసారు.
ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో ముస్లిం వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం వల్ల వారిపై ఎక్కడికెళ్లిన ఓ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఫ్రాన్స్ లో దాడి తర్వాత యూరఫ్, అమెరికాల్లో ఈ దోరణి మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మంచి వారైన ముస్లిం ప్రజలకు తమ మద్దతు పలకడంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
అందులో భాగంగానే మంచు లక్ష్మి ఈ పోస్టర్ ప్రదర్శించారు. కొందరు టెర్రరిస్టులు చేసే పనుల వల్ల మిగిలిన ముస్లింలపై వివక్ష చూపడం సరికాదు అనే సందేశం ఇవ్వడానికే మంచు లక్ష్మి ఇలా చేసారని అంటున్నారు.