twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీజేపీలో చేరిన సినీ గేయరచయిత జొన్నవిత్తుల

    By Bojja Kumar
    |

    Lyricist Jonnavithula to join BJP
    హైదరాబాద్: ప్రముఖ సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. నరేంద్ర మోడీ విధానాలతో బీజేపీ పార్టీ వైపు ఆకర్షితుడైన తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు జొన్నవిత్తుల తెలిపారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

    జొన్నవిత్తుల సినీ గేయరచయితగానే కాకుండా సుప్రసిద్ద తెలుగు కవిగా పేరుగాంచారు. ఆయన గతంలో తెలుగు అధికార భాషా సంఘం సభ్యులుగా పని చేసారు. తెలుగు సినిమాలైన నెంబర్ 1, దేవుళ్లు, శ్రీ మంజునాథ, విక్కమార్కుడు, ఒక్కడున్నాడు, యమదొంగ, సుందరకాండ, సోంబేరి, అంజనీ పుత్రుడు, శక్తి, శ్రీరామ రాజ్యం చిత్రాలతో పాటు అనేక చిత్రాలకు జొన్నవిత్తుల పాటలు రాసారు.

    దీంతో పాటు ఆయన శ్రీ రామలింగేశ్వర శతకము, తెలుగు శంఖారావం అనే రచనలు చేసారు. సోంబేరి అనే చిత్రానికి జొన్న విత్తుల దర్శకత్వం కూడా వహించారు. తెలుగ బాషాభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేసారు. ఆయన తాజాగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం అయింది.

    English summary
    
 Tollywood Lyricist Jonnavithula Ramalingeswara Rao has announced that he will be joining Bharatiya Janata Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X