Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినీ గీత రచయిత కొడుకు, కోడలు ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ గీత రచయిత సంతోష్ ఆనంద్ కుమారుడు, కోడలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో సంతోష్ ఆనంద్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు సంకల్ప్ ఆనంద్ (38), కోడలు నందిని (34) తమ ఐదేళ్ల కుమార్తెతో కలిసి వద్ద వేగంగా వస్తున్న రైలు కింద దూకారు. అక్టబర్ 15 ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
కోసికాలన్ టౌన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సంకల్ప్, నందిని అక్కడిక్కడే మరణించారు. చిన్నారికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్చారు. రైలు పట్టాల పక్కనే నిలిచి ఉంచిన వారి కారులో 10 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆర్ధిక కారణాలతోనే తాము తీవ్రమైన నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొన్నారు.
సంకల్ప్ సెంటర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రభుత కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. సూసైడ్ నోట్ పక్కనే సంకల్ప్ ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడంతో వారిని గుర్తించడం సులువైంది. వారు గురువారమే ఢిల్లీ నుంచి వచ్చారని పోలీసులు తెలిపారు. కుమారుడు, కోడులు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందుకున్న వెంటనే సంతోష్ ఆనంద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.