Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'మా' ఓటమి: జయసుధ బ్యాడ్ లక్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ..
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడి ప్రముఖ సినీ నటి జయసుధ ఓటమి పాలు కావడం ఆమె దురదృష్టరమే. రాజేంద్ర ప్రసాద్పై 85 ఓట్ల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాలో 702 మంది సభ్యులుండగా కేవలం 394 మంది మాత్రమే ఓటేశారు. అలా చూస్తే రాజేంద్ర ప్రసాద్ది ఘన విజయమే.
మా ఎన్నికల్లోనూ కాదు, శాసనసభ ఎన్నికల్లోనూ జయసుధను దురదృష్టం వెంటాడింది. రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తూ వస్తున్న జయసుధ తన సహజ లక్షణానికి భిన్నంగా మా ఎన్నికల్లోకి దిగారు. కాంగ్రెసుకు తెలంగాణలో వ్యతిరేక పవనాలు వీస్తున్న స్థితిలో సికింద్రాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయసుధ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ డిజైనర్గా మారిపోయారు.
తనకు నచ్చిన కొన్ని సినిమాలు చేస్తూ ఫ్యాషన్ డిజైనర్గా అవతారం ఎత్తి తనకు ఇష్టమైన పని చేసుకుంటూ వస్తున్నారు. ఈ స్థితిలో మా ఎన్నికల్లోకి దిగారు.
సినీ నటుడు అన్నట్లు మా ఎన్నికల్లో ఓటమి మురళీ మోహన్దే గానీ జయసుధది కాదు. చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి మా ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు కనిపించింది. ఓట్ల లెక్కింపునకు జయసుధ హాజరు కాలేదు. ఆమె తరఫున నటుడు నరేష్ హాజరయ్యారు.
నిజానికి, జయసుధ విజయం సాధిస్తుందని అందరూ ఊహిస్తూ వచ్చారు. కానీ, ఫలితం తిరగబడింది. చాలా నిశ్శబ్దంగా మురళీ మోహన్ వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిఫలించినట్లు చెప్పవచ్చు. ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ వర్గానికి, మురళీ మోహన్ వర్గానికి మధ్య మాటల యుద్ధం సాగింది.