Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందుబాటులో ఉంటారని, జయసుధకు వ్యతిరేకం కాదు: నాగబాబు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు నాగబాబు స్పందించారు. సాక్షి తెలుగు టీవీ చానెల్తో ఆయన ఫోన్లో మాట్లాడారు .మా అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్ను ఏకగ్రీవం చేయాలని అనుకున్నామని ఆయన అన్నారు తాము జయసుధకు వ్యతిరేకం కాదని, అయితే నలుగురికి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడయితే బాగుంటుందని భావించి మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు.
మా ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించారని ఆయన అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు సాక్షి టీవీ చానెల్తో అన ్నారు.
మా సభ్యత్వ రుసుం తగ్గించాలని, చాలా మందికి రుసుం కారణంగా సభ్యత్వం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు ఉందని, ఎక్కువ మంది సభ్యులు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని ఆయన అన్నారు. మా ఎన్నికల సందర్భంగా తొలి దశలో జరిగిన కొన్ని పరిణామాలు తమకు మనస్తాపం కలిగించినా కోర్టు వరకూ వెళ్లాలన్న ఆలోచన రాలేదని అన్నారు. అయితే, పరిణామాలు మరో నటుడు ఓ కళ్యాణ్కు నచ్చకపోవడంతో కోర్టుకు వెళ్లారని అన్నారు.