Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
రామ్ చరణ్తో సూరి తమిళ రీమేక్, విలన్ రోల్లో ఆ హీరో?
హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది హాట్ టాపిక్ అయింది.
తమిళంలో విలన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగులో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్ నాగార్జున పేరు కూడా వినిపించింది. అయితే నాగార్జున ఈ రోల్ చేయడం లేదని తేలిపోయింది. తాజాగా నటుడు మాధవన్ పేరు వినిపిస్తోంది.
మాధవన్ తెలుగు ప్రేక్షకులు లవర్ బాయ్ గానే పరిచయం. ఆయన హీరోగా వచ్చిన రన్, సఖి, చెలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం తర్వాత మళ్లీ మాధవ్ తెలుగు తెరపై, అందులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘థాని ఓరువన్' చిత్రం రీమేక్ రైట్స్ భారీగా ధరకు కొనుగోలు చేసారు. తమిళంలో ఈ చిత్రం జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కింది.