Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
25 లక్షలు విరాళం ప్రకటించిన మహేష్ బాబు
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అభిమానులకు పిలుపు ఇచ్చారు. హుధూద్ తుఫాన్ ఊహించని నష్టాన్ని కలిగించిందని, ప్రభావిత ప్రాంతాలు త్వరగా పునర్ వైభవాన్ని సంతరించుకోవాలని మహేష్ బాబు ఆకాంక్షించారు.
ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరొక 20 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.
శాటిలైట్ సిస్టం హెచ్చరికలతో హుధూద్ తుఫాన్ గురించి ముందే తెలియడంతో అంతా ముందుగానే అప్రమత్తం అయ్యారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంగో పెనుగాలులు వీయడంతో ఆస్తి నష్టం భారీగా ఏర్పడింది.
ఈ రోజు ప్రధాన మంత్రి మోడీ విశాఖలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం కింద రూ. 1000 కోట్ల సహాయం ప్రకటించారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సినీ తారలతో పాటు, తెలుగు వారంతా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.