Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
మహేష్ బాబు ల్యాండ్ కొన్నారు, ఎక్కడంటే..?
హైదరాబాద్: భూమిపై పెట్టబడి ఎప్పటికైనా లాభదాయకమే అనేది పెద్దలు చెప్పే మాట. అందుకే సినీ సెలబ్రిటీల్లో చాలా మంది ఈ దిశగా పెట్టుబడి పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ భూములు కొనుగోలు చేసి ఫాం హౌస్ లు ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఓసియన్ పార్క్ సమీపంలో మహేష్ బాబు 3 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన భారీగానే వెచ్చించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు అక్కడ ల్యాండ్ కొన్న తర్వాత గండిపేట్ పరిసర ప్రాంతాల్లో భూముల డిమాండ్ పెరిగిందట. దీంతో ఆ ఏరియాలోని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ తో సినిమా చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కానప్పటికీ షూటింగ్ షెడ్యూల్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయితే దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది.
ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా, రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.