Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పదేళ్ల తర్వాత మహేష్ బాబు మళ్లీ అదే సీజన్లో...
హైదరాబాద్: సమ్మర్ సీజన్లో మహేష్ బాబు సినిమా వచ్చి దాదాపు పదేళ్లయింది. 2006లో ఆయన నటించిన ‘పోకిరి' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత మళ్లీ వేసవి సీజన్లో మహేష్ సినిమాలేవీ విడుదల కాలేదు.
దశాబ్దం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెలలోనే తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది.
ఈ సినిమాలో మహేష్ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.
బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, ప్రకాష్రాజ్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, కూర్పు: శ్రీకర ప్రసాద్, కళ: తోట తరణి.