Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
మహేష్ -పూరి కాంబినేషన్లో మరో సినిమా ఓకే అయినట్లే!
హైదరాబాద్: పోకిరి, బిజినెస్మేన్ చిత్రాల తర్వాత మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బేనర్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారి ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు- పూరి కాంబినేషన్లో వచ్చే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు ఇమేజ్కు తగిన విధంగా ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.
మరో వైపు పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్టు వర్కుపై దృష్టి సారించనున్నారు. 2015లో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.