Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కనిపిస్తే కిల్ చేయమని ఫ్యాన్స్ కు మహేష్ పిలుపు
హైదరాబాద్: మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే చిత్రం సూపర్ హిట్ టాక్ ని మోసుకుని వచ్చి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ ని అదరకొడుతోంది. అయితే పైరసీ అనేది ఈ చిత్రం కలెక్షన్స్ కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు తన అభిమానులకు పైరిసీని కిల్ చేయమని పిలుపు ఇచ్చారు.
A
movie
is
an
experience
to
be
had
in
a
theatre
Dont
miss
it
.Enjoy
my
films
on
the
big
screen.
pic.twitter.com/ZrLSq5ZJrR
—
Mahesh
Babu
(@urstrulyMahesh)
August
12,
2015
‘సినిమా అనేది థియేటర్ లో చూసి ఆస్వాదించాల్సినది. శ్రీమంతుడు సినిమాని సిల్వర్ స్క్రీన్ పై మిస్ అవ్వద్దు. నా అన్ని సినిమాలను బిగ్ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చెయ్యండి. '
I
urge
all
my
fans
and
all
the
people
who
love
watching
movies
to
help
kill
piracy
.
—
Mahesh
Babu
(@urstrulyMahesh)
August
12,
2015
నా
అభిమానులకు
మరియు
సినిమాని
ప్రేమించే
అభిమానులకు
పైరసీని
ఎంకరేజ్
చెయ్యద్దని,
ఎక్కడన్నా
కనిపిస్తే
పైరసీని
కిల్
చెయ్యండని
కోరుతున్నా
మహేష్బాబు నటించిన ‘శ్రీమంతుడు' చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. పతాకంపై నవీన్ ఎర్నేని రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ తొలిరోజే 30 కోట్ల రూపాయల షేర్ను సాధించిందని నిర్మాత తెలిపారు.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, అన్ని చోట్లా సినిమా పెద్ద హిట్ అయిందని, మొదటిరోజునుండి అన్ని వర్గాల ప్రేక్షకుల వౌత్టాక్తోనే అనుకున్నదానికన్నా హిట్ అయిందని తెలిపారు. ఇటువంటి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్న కధానాయకుడి కష్టమంతా ఈ చిత్రంలో కన్పిస్తుందని, చిత్ర విజయం గూర్చి విన్న తరువాత తాము పడ్డ కష్టం మర్చిపోయామని ఆయన అన్నారు.
ప్రేక్షకులనుండి తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, అన్ని కేంద్రాల్లో మంచి రిపోర్టులు వస్తున్నాయని, భారతదేశంలోనే కాక యుఎస్ఎ, ఓవర్సీస్లో విజయఢంకా మ్రోగిస్తోందని ఆయన తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్బాబు.
దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ చాలా సింపుల్గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్గా ఉంటారు. శ్రుతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్ సంభాషణలుండవు'' అన్నారు.
జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్ రుషి, సంపత్, హరీష్, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్: రాజుసుందరం, దినేష్, బాస్కో సీజర్, థ్రిల్స్: అనల్ అరసు, అసిస్టెంట్ డైరెక్టర్స్: త్రివేది, అసోసియేట్ డైరెక్టర్స్: శేషు, జయరాం రవి,
కో డైరెక్టర్స్: వాసు, తులసి, చీఫ్ కో డైరెక్టర్స్: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎమ్), కథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.