Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో వారసుడు... పేరు సత్య ప్రభాస్
హైదరాబాద్: తెలుగు సినీరంగంలోకి వారసుల రాక కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఇపుడు తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా వారసులే ఉన్నారు. ఇదే క్రమంలో మరొకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతని పేరు సత్య ప్రభాస్. కొంపతీసి హీరో ప్రభాస్ చుట్టం అని మాత్రం అనుకోవద్దు.
ఒకప్పుడు చంటి, పెదరాయుడు, యముడికి మొగుడు లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు రవి రాజా పనిశెట్టి తనయుడే ఈ సత్య ప్రభాస్. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు ఆది పనిశెట్టి ఇటు తెలుగు, అటు తమిళం సినిమాల్లో రాణిస్తున్నాడు. అయితే సత్య ప్రభాస్ సోదరుడిలా నటుడిగా కాకుండా.... తండ్రి మాదిరి దర్శకుడిగా రాణించాలని నిర్ణయించుకున్నాడు.
అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో దర్శకత్వ శాఖలో కోర్సు చేసిన సత్య ప్రభాస్.... స్టూడెంట్ గా ఉన్నపుడు షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు సొంతం చేసుకున్నాడు. దర్శకత్వ శాఖలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన తర్వాత దర్శకుడిగా ఎంటరీ ఇచ్చారు.
తాజాగా ‘మలుపు' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలో ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్య ప్రభాస్ సోదరుడు ఆది పనిశెట్టి, నిక్కి గల్రాణి, మిథున్ చక్రవర్తి, నాసర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.