Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
250 మందికి సూపర్ స్టార్ హార్ట్ ఆపరేషన్స్
వెండితెరమీదే కాదు నిజ జీవితంలోనూ మళయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి హీరో అనిపించుకుంటున్నారు. ఆయన 250 మంది హృద్రోగులకు అండగా నిలిచాడు. ఇందుకోసం తిరువనంతపురంలోని నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో చేతులు కలిపాడు. నిమ్స్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న హృద్రోగులతో కొద్ది సమయం గడిపేందుకుగాను గురువారం ఈ ఆసుపత్రిని ఆయన సందర్శిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ రెండేళ్ళ కిందటే 100 పేద హృద్రోగులకు ఉచిత బైపాస్ సర్జరీలతో పాటు పూర్తిగా ఉచిత చికిత్సకు సంబంధించి నిమ్స్తో కలిసి తాము ప్రకటన చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే పథకాన్ని మరో 250 మంది పేద రోగులకు వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు.
ఈ నెలలో 58 ఏళ్ళ వయసుకు చేరుకుంటున్న మమ్ముట్టి, తన అభిమాన సంఘాల తోడ్పాటుతో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద హృద్రోగులకు శస్త్రచికిత్సలు మాత్రమేగాక ఉచితంగా క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలకు కూడా చేయిస్తున్నారు. నటుడు మమ్ముట్టి దాతృత్వాన్ని నిమ్స్ ఎండీ ఫైజల్ ఖాన్ ప్రశంసించారు. ''వైద్య శిబిరాల ద్వారా మమ్ముట్టి అభిమానులు హృద్రోగులను గుర్తించారు. రోగుల ఆర్థిక పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరీక్షించి నిరుపేద రోగులను ఎంపిక చేశారు. వీరిని మా ఆసుపత్రిలో చేర్చిన తర్వాత పూర్తి చికిత్స అందించి పంపిస్తాం'' అని చెప్పారు.