Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాహుబలి-2 సినిమా చూస్తుండగా విషాదం
బాహుబలి 2 సినిమా చూస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు.
హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్'బాహుబలి-2' సినిమా చూస్తుండగా విషాదంచోటు చేసుకుంది. ఈ సూపర్ హిట్ మూవీని చూసేందుకు వెళ్లి ఓ ప్రేక్షకుడు థియేటర్లోనే మృతి చెందాడు.
హైదరాబాద్ ఆసిఫ్ నగర్లోని అంబా సినిమా హల్కి వచ్చిన ముబషీర్ అహ్మద్కి బాహుబలి-2 సినిమా చూస్తుండగానే గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మరణించినట్లు సమాచారం.
ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మోత మ్రోగిస్తూ బాక్సాఫీసు రేసులో దూసుకెళ్లిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ బాహుబలి-2 విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా 1050 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకుని యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసింది.
బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక బాక్సాఫీసు స్కోరు రూ. 700 కోట్లు(పికె) పైచిలుకు మాత్రమే. అయితే ఆ రికార్డును చెరిపేయడంతో పాటు రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది.