Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గుండె పోటు రాలేదు: రొటీన్ చెకప్ కోసమే మణిరత్నం ఆసుపత్రికి
హైదరాబాద్: ప్రముఖ ఫిల్మ్ మేకర్ మణిరత్నం మంగళవారం న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన గుండెపోటు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, ఆయన కేవలం రోటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే వెళ్లారని ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు. మణిరత్నం పూర్తి ఫిట్ గా ఉన్నారని మద్రాస్ టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మణియన్ తెలిపారు.
‘ఓకే బంగారం' విజయం సాధించడంతో మణితర్నం, ఆయన భార్య సుహాసిని ప్రస్తుతం ఢిల్లీలో హాలీడేస్ గడుపుతున్నారు. గతంలో ఆయనకు గుండె పోటు వచ్చిన నేపథ్యంలో రొటీన్ చెకప్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. సాధారణంగా చెన్నైలో ఉంటే అక్కడే చేయించుకునే వారు. ఆ సమయానికి ఢిల్లీలో ఉండటంతో ఇక్కడే చెకప్ కోసం వెళ్లారు' అని మాల మణియన్ స్పష్టం చేసారు.
గతంలో 2004, 2009 సంవత్సరాల్లో యువ, రావణ్ సినిమాల షూటింగ్ సందర్భంగా మణిరత్నంకు మైనర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఆయన రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు. రెండు దశాబ్దాల సినీ కెరీర్లో మణిరత్నం పలు అద్భుతమైన చిత్రాలు అందించారు. నాయగన్, మౌనరాగం, రోజా, దిల్ సే, బొంబాయి, గురు లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి.