Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మంచు మనోజ్ టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? అమ్మ మరణం వల్లనే అని....
జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన గుంటూరోడు టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు.
డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని 'ఒక్కడు మిగిలాడు', 'గుంటూరోడు' అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడిగా 'గుంటూరోడు' సినిమా రూపొందింది. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత పనులను వేగంగా జరుపుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. సంపత్, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు. గుంటూరులో ఒక వేడుక ద్వారా ఈ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశం జయలలిత వంటి గొప్ప నాయకురాలిని కోల్పోవడం వలన, టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు మనోజ్ చెప్పాడు. టీజర్ రిలీజ్ కి కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని అన్నాడు.