Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగాస్టార్ మనవరాళ్ళు.., ఆ సినిమా చూసి ఇలా కొట్టుకుంటున్నారట...
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతుళ్లు ‘దంగల్’ సినిమా చూసినప్పటి నుంచి ఇలా కుస్తీ పడుతున్నారట. ఈ ఫోటోను ట్వీట్ చేసిన సుస్మిత
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా దంగల్ సినిమా ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది.
దేశమంతా 'దంగల్' ఫీవర్తో ఊగిపోతోంది. అమీర్ఖాన్ అందించిన ఈ క్లాసిక్ మూవీ ఎంతో మంది ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. పెద్దలే కాదు.. పిల్లలు కూడా 'దంగల్'కు ఫిదా అయిపోతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటోలోని చిట్టి మల్లయోధులు. వీరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మనవరాళ్లు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతుళ్ల వీళ్లు. 'దంగల్' సినిమా చూసినప్పటి నుంచి ఇలా కుస్తీ పడుతున్నారట. ఈ ఫోటోను ట్వీట్ చేసిన సుస్మిత.. 'అమీర్ఖాన్, 'దంగల్' చిత్ర యూనిట్ కేవలం ఒక సినిమా మాత్రమే తీయలేదు.. అందరిలో ఓ స్ఫూర్తిని రగిలించారు. ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు అంటూ పోస్ట్ చేసింది.
ఇకపోతే.. అమీర్ ఖాన్ దంగల్ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా బృందంపై సినీ నటుడు పవన్కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన జీవిత కథతో మంచి విజయం అందుకున్న అమీర్ ఖాన్కు, ఆయన బృందానికి పవన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనసుల్ని కదిలించేలా చిత్రాన్ని తీశారంటూ దర్శకుడు నితీశ్ తివారీని, మిగిలిన చిత్ర బృందాన్ని అభినందించారు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రాని ప్రత్యేకించి అభినందించారు. 'దంగల్'ని చూశానని, చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందని చెప్పటం విశేషం...